సర్వేకు సర్వే తీరును వివరించిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ (ఇలాకా) నవంబర్ 6: తెలంగాణ వ్యాప్తంగా చేపట్టిన సామాజిక, ఆర్ధిక, ఉపాధి, రాజకీయ, కుల సర్వే తీరును రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు వివరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ సర్వే ప్రక్రియకు సంబంధించిన అన్ని అంశాలను తెలియజేశారు. 2025లో దేశ వ్యాప్తంగా చేపట్టబోయే జనగణనలో తెలంగాణ తరహాలో కుల గణనను పరిగణలోకి తీసుకునే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా గవర్నర్ ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణన దేశానికి రోల్ మోడల్గా నిలుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఎంపీలు పోరిక బలరాం నాయక్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్ అలీ, డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి తదితరులున్నారు.