హైదరాబాద్ (ఇలాకా) నవంబర్ 6: తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకు లిమిటెడ్ (టీజీసీఎబీ) పాలకవర్గం ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.1,51,01,116 విరాళం అందించింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి టీజీసీఎబీ పాలకవర్గం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో టీజీసీఎబీ చైర్మన్ ఎం.రవీందర్ రావు, వైస్ చైర్మన్ కె.సత్తయ్య, పలువురు డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.